కూనవరం: తమ సామాజిక వర్గానికి దేవాలయాల పాలక మండళ్లలో స్థానం కల్పించడంతో పాటు పలు పథకాలు అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయీ బ్రాహ్మణులు ఆజన్మాంతం రుణపడి ఉంటారని నాయీ బ్రాహ్మణుల రాష్ట్ర సమితి కార్యదర్శి మాచవరపు సత్యనారాయణ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు అయినపర్తి ఉషారాణి అన్నారు. నాలుగు మండలాల నాయీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో మంగళవారం కూనవరం బస్స్టాండ్ సెంటర్లో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు మాట్లాడుతూ తరతరాల నుంచి కనీస గుర్తింపునకు నోచుకోని నాయీ బ్రాహ్మణులకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక తగిన గుర్తింపు లభించిందని చెప్పారు. కేశఖండన శాలలో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించిన ఏకై క ప్రభుత్వం వైఎస్సాసీపీ ప్రభుత్వమేనని తెలిపారు. ఈకార్యక్రమంలో నాయీబ్రాహ్మణుల కులపెద్దలు మండా దుర్గాప్రసాద్, సూర్యనారాయణ, జిల్లా సమితి కన్వీనర్ ఎం.వి.రాజు, కె.వెంకట్రావు, జిల్లా యువజన అధ్యక్షుడు గున్నపల్లి శేషగిరి,కో కన్వీనర్ గోల్కొండ కొండబాబు, ఎం.శ్రీను, వై.శ్రీను, డి.రాజేష్, కాసులు, రాము,సూరిబాబు, రమేష్ పాల్గొన్నారు.