పూటుగా మద్యం సేవించి వ్యక్తి మృతి

22 Mar, 2023 02:28 IST|Sakshi

అనకాపల్లిటౌన్‌ : పూటుగా మద్యం సేవించి వ్యక్తి మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ వి.సత్యనారాయణ అందించిన వివరాలిలా ఉన్నాయి. కూర్మన్నపాలెం పెదయాతపాలేనికి చెందిన పట్నాల నూకరాజు(32) వృత్తిరీత్యా మచిలీపట్నం బందర్‌ సెలూన్‌షాపులో పని చేస్తున్నాడు. బందరు నుంచి రెండురోజుల క్రితం స్వగ్రామం పెదయాతపాలేనికి ఉగాది పండగకు బయల్దేరాడు. ప్రయాణంలో నూకరాజు అతిగా మద్యం సేవించి స్థానిక జాతీయ రహదారిపై మృతి చెంది పడి ఉన్నాడు. మృతదేహం గురించి సమాచారం అందడంతో ఎస్‌ఐ మంగళవారం ఘటనాస్థలికి వెళ్లి మృతుని సెల్‌ఫోన్‌ నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నూకరాజు అత్త ఆదిలక్ష్మి వచ్చి మృతుడు తన అల్లుడేనని గుర్తించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎన్టీఆర్‌ వైద్యాలయానికి తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.

మరిన్ని వార్తలు