ఎఫ్‌ఎం బాబాయ్‌కి సత్కారం

22 Mar, 2023 02:28 IST|Sakshi

మునగపాక: కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఏపీ గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. వాడ్రాపల్లికి చెందిన సీనియర్‌ కళాకారుడు ఎఫ్‌ఎం బాబాయ్‌ త్రినాథస్వామిని మునగపాకలో సోమవారం రాత్రి నందీశ్వర తులసీ కళావేదికపై ఘన సత్కరించారు. గ్రామీణ యువజన సాంస్కృతిక సంస్థ కన్వీనర్‌ సూరిశెట్టి రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి హాజరైన ప్రసాద్‌ మాట్లాడుతూ ఎఫ్‌ఎం బాబాయ్‌గా గుర్తింపు పొందిన త్రినాథస్వామి పలు చిత్రాల్లో నటించడంతో పాటు పరిషత్‌ నాటకాల్లో తన ప్రతిభ చూపుతున్నారన్నారు. డాక్టర్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ త్రినాథస్వామి తన జీవితాన్ని కళారంగానికి అంకితం చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దిమ్మల అప్పారావు, జెడ్పీటీసీ స్వామి సత్యనారాయణ,వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు,కళాకారులు విల్లూరి జగ్గప్పారావు,మళ్ల కృష్ణ,పెంటకోట రాము,ఆడారి శేఖర్‌,దశావతారం,లీలా భాస్కరరావు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు