ఎస్.రాయవరం : పి.ధర్మవరం సమీపంలో జాతీయరహదాపై వరహానది బ్రిడ్జిపై మంగళవారం లారీ అదుపుతప్పి బోల్తాపడి, ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. ఈ మేరకు ఎస్ఐ ప్రసాద్రావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.యలమంచిలి వైపు నుంచి అడ్డురోడ్డు వైపు సిమ్మెంట్ పలకల లోడుతో వెలుతున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ లారీ పై ప్రయాణిస్తున్న శివప్రసాద్, డెబీష్, శంకర్ లకు గాయాలయ్యాయి.ఇందులో శివప్రసాద్ కాలు విరిగి తీవ్రంగా గాయపడినట్టు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది తెలిపారు. ఈ లారీ బోల్తాపడిన సమయంలో సుమారు 20 నిమిషాలు పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ప్రసాద్రావు సిబ్బందితో వెళ్లి ట్రాఫిక్ సమస్యను క్లీయర్ చేశారు. గాయపడిన వారు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. లారీ ఓనరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు.