ఎంవీపీకాలనీ: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం జాబ్మేళా నిర్వహించనున్నారు. ఉపాధి కల్పన మిషన్ (సీడాప్), డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ జాబ్మేళా ద్వారా 10 కంపెనీల్లో 417 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. హనీగ్రూప్, రిలయన్స్, అపోలో, మెడ్ప్లస్, మ్యాక్స్, రిలయన్స్ డిజిటల్స్, స్పెన్సర్, ఖజానా జువలరీస్, వరుణ్ మోటార్స్, రిలయన్స్ ఫుడ్ప్రింట్స్ కంపెనీల్లో ఖాళీల భర్తీకి కోసం నిర్వహించనున్న ఈ మేళా పెందుర్తిలోని జిల్లా సమైక్య భవన్లో ఉదయం 10 గంటలకు జరగనుంది. వివరాలకు 73867 13880 నంబర్లో సంప్రదించవచ్చు.