గాయపడిన మహిళ మృతి

23 Mar, 2023 01:16 IST|Sakshi

అనకాపల్లిటౌన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ కె.డి.ఎస్‌.ఎ.రాజు చెప్పారు. హెచ్‌సీ కథనం మేరకు వివరాలు... విశాఖకు చెందిన వంగలపూడి మంగవేణి(57) ఈనెల 15న తమ కుమార్తె ఫంక్షన్‌ నిమిత్తం విశాఖ నుంచి కశింకోటకు బి.కిరణ్‌ ద్విచక్రవాహనంపై వెళుతుండగా మండలంలో కొప్పాక జంక్షన్‌ వద్ద బైక్‌ నుంచి జారి పడిపోయింది. ఈ ప్రమాదంలో మంగవేణి తలకు తీవ్రగాయం కావడంతో అనకాపల్లి ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్టు మృతుని కుమారుడు సాయిరమేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు హెచ్‌సీ చెప్పారు.

మరిన్ని వార్తలు