అఘోరాల ముసుగులో హల్చల్‌

23 Mar, 2023 01:16 IST|Sakshi

నర్సీపట్నం: అఘోరాల ముసుగులో పలువురు నర్సీపట్నంలో హల్‌చల్‌ చేశారు. ఆరు నెలల క్రితం ఇదే విధంగా అఘోరాల మంటూ సన్యాసులు మద్యం సేవించి పట్టణంలో వీరంగం సృష్టించి, ప్రజలను భయాందోళనకు గురి చేశారు. ఉగాది పండగ రోజున మరోసారి తప్పతాగి ఒంటి మీద బట్టలు లేకుండా అఘోరాల మంటూ పట్టణంలో మరోసారి హల్‌చల్‌ చేశారు. మెయిన్‌రోడ్డుపై వెళ్లే వాహనాలను అడ్డగించి వాహనదారుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. డబ్బులు ఇవ్వని వాహనాలను కదలనివ్వలేదు. వారి వికృత చేష్టలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు