విశాఖ స్పోర్ట్స్: యూసీసీ టీ20 క్రికెట్లో భాగంగా మోదమాంబ జట్టు మెట్రోసీసీ జట్లు విజయం సాధించాయ. వైఎస్సార్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన గాజువాక గ్రీన్స్ ఆరు వికెట్లకు 167 పరుగులు చేసింది. ప్రతిగా మోదమాంబ జట్టు మరో రెండు బంతులుండగానే తొమ్మిది వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్నందుకుంది. సింహాద్రి 74పరుగులు చేశాడు. అప్పన్న నాలుగు వికెట్లు తీశాడు. మరో మ్యాచ్లో యలమంచిలి సీసీ 13.2 ఓవర్లలో 44 పరుగులకే ఆలౌటైంది. ప్రతిగా మెట్రోసీసీ వికెట్ కోల్పోకుండానే విజయాన్నందుకుంది. పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ సీఈవో శివారెడ్డి ట్రోఫీలు అవిష్కరించారు.