మోదమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

23 Mar, 2023 01:16 IST|Sakshi

సాక్షి,పాడేరు: ఉగాది పండగను జిల్లాలో అన్ని వర్గాల భక్తులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రమైన పాడేరులోని అన్ని ఆలయాల్లోను భక్తుల తాకిడి నెలకొంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరులోని మోదకొండమ్మతల్లి ఆలయానికి వేకువజామునుంచే భక్తులు పోటెె త్తారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం మోదమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. ఎస్పీ సతీష్‌కుమార్‌,ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ తమర్భ నర్సింగరావు,ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు తదితరులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. సాయంత్రం నుంచి భక్తులు తాకిడి అధికమైంది. మాజీ మంత్రి మణికుమారి సమకూర్చిన పులిహోర, ఇతర ప్రసాదాలను పంపిణీ చేశారు.

>
మరిన్ని వార్తలు