రైతులను ఆదుకోవాలి

21 Mar, 2023 02:02 IST|Sakshi

శింగనమల: అకాల వర్షాలకు శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో సీఎంను కలిసిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో 3996 మంది రైతులు చేతికొచ్చిన పంటలను వర్షాల వల్ల నష్టపోయారని వివరించారు.

నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, వేరుశనగ తదితర వ్యవసాయ పంటలు దాదాపు 4,996 ఎకరాలు, అరటి, చీనీ, మామిడి, సపోటా, టమాట తదితర ఉద్యాన పంటలు దాదాపు 3,222 ఎకరాల దాకా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధిత రైతులను ఆదుకునేందుకు సీఎం సానుకూలంగా స్పందించారు.

మరిన్ని వార్తలు