ఏపీలో కొత్తగా 10,199 కరోనా కేసులు

3 Sep, 2020 18:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 10,199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో 62,225 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 39,05,775 మందికి రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరిపారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. (చదవండి: సోమవారం శుభవార్త వింటాం: ఎస్పీ చరణ్)

కరోనా బారినపడి తూర్పుగోదావరిలో 10, చిత్తూరులో 9, గుంటూరులో 9, అనంతపురంలో 7, కృష్ణాలో 7, పశ్చిమగోదావరిలో 7, నెల్లూరులో 6, కడపలో 5, కర్నూలులో 4, శ్రీకాకుళంలో 4, ప్రకాశంలో 3, విశాఖపట్నం, విజయనగరంలో ఇద్దరు చొప్పున మొత్తం 75 మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 4,200కు చేరుకుంది. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 9,499 మంది  క్షేమంగా  కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 3,57,829 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 1,03,701 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు