ఏపీలో రికార్డ్‌ స్థాయిలో కరోనా పరీక్షలు

22 Aug, 2020 18:38 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డ్‌ స్థాయిలో కరోనా వైరస్‌ పరీక్షలు జరిగాయి. ఇప్పటికివరకు 31లక్షల 91 వేల 326 మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. గత 24 గంటల్లో 61,469 మందికి కరోనా పరీక్షలు చేయగా 10,276 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,216కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 8,593 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, మొత్తం 2,52,638 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నిన్న ఒక్కరోజు  97 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89,389 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు