ఏపీలో కొత్త‌గా 10,776 క‌రోనా కేసులు

4 Sep, 2020 19:44 IST|Sakshi

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో శుక్రవారం కొత్త‌గా 10,776 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఏపీ వైద్యారోగ్య‌శాఖ హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 59,919 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా.. 10,776 మందికి  పాజిటివ్‌గా నిర్థార‌ణ‌యింది. దీంతో  ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య  4,76,506కు పెరిగింది. 24 గంట‌ల్లో కొత్త‌గా 12,334 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం కోలుకున్న‌వారి సంఖ్య 3,70,163కు చేరింది.

క‌రోనాతో కొత్త‌గా 76 మంది మృతి చెంద‌గా.. మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4276గా ఉంది. ప్ర‌స్తుతం ఏపీలో 1,02,067 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివ‌ర‌కు రికార్డుస్థాయిలో 39,65,694 మందికి క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఏపీలో క‌రోనా పాజిటివ్ రేటు 12.02 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు