సాక్షి, అమరావతి: కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతోంది. గడిచిన 24 గంటల్లో 72,573 నమూనాలు పరీక్షించగా 10,794 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల 4,98,125 కు సంఖ్య చేరింది. తాజా పరీక్షల్లో 35,358 ట్రూనాట్ పద్ధతిలో, 37,215 ర్యాపింగ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. వైరస్ బాధితుల్లో కొత్తగా 70 మంది మృతి చెందడంతో ఆ సంఖ్య 4417 కు చేరింది. గత 24 గంటల్లో 11,915 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,94,019 కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 99,689 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇప్పటివరకు 41,07,890 కరోనా పరీక్షలు నిర్వహించామని తెలిపింది.
(చదవండి: అసత్య ప్రచారంపై ఎన్నికల కమిషన్ సీరియస్)