టెన్త్‌ విద్యార్థిని అదృశ్యం

25 Jul, 2022 09:32 IST|Sakshi

అనంతపురం: స్థానిక గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం దుద్దేకుంటకు చెందిన నాగరాజు కుమార్తె హాసిని గుత్తిలోని ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు వచ్చి ఆమెను పలకరించి వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం తల్లిదండ్రులతో ఫోన్‌లో హాసిని మాట్లాడింది. ఆ తర్వాత పాఠశాల నుంచి కనిపించకుండా పోయింది. విషయాన్ని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ సమాచారం అందించడంతో తండ్రి నాగరాజు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నాడు. అనంతరం ప్రిన్సిపాల్‌తో కలసి గుత్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై సీఐ వెంకట్రామిరెడ్డి దర్యాప్తు చేపట్టారు.   

మరిన్ని వార్తలు