ఏపీలో కొత్తగా  1,121 కరోనా కేసులు

22 Nov, 2020 17:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు చేయగా 1 ,121 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,62,213కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 1,631 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,41,026 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 14,249. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 11 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,938కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌​ బులెటిన్‌ విడుదల చేసింది.

మరిన్ని వార్తలు