ఏపీలో కొత్తగా 1,184 కరోనా కేసులు

31 Mar, 2021 18:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 30,964 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,184 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 901989 మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 456 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,87,434 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం నలుగురు మృతి చెందగా, ఇప్పటివరకు 7217 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 7338 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,50,83,179 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు