ఏపీలో కొత్తగా 137 కరోనా కేసులు..

22 Jan, 2021 17:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 48,313 కరోనా పరీక్షలు నిర్వహించగా, 137 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 886694కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. చదవండి: ఆంధ్రప్రదేశ్:‌ వ్యాక్సినేషన్‌ విధుల్లో 7 లక్షల మంది

కోవిడ్‌ బారినపడి గడచిన 24 గంటల్లో అనంతపురం, గుంటూరు, కర్నూలు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మరణించగా, ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7146కి చేరింది. గడచిన 24 గంటల్లో  కోవిడ్‌ నుంచి కోలుకుని 167 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,78,060 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 1,488 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,27,87,961 శాంపిల్స్‌ను పరీక్షించారు. చదవండి: టీకాల పనితీరుపై.. ‘టెన్షన్‌’ ప్రభావం!

మరిన్ని వార్తలు