సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 31,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,398 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,05,946 మందికి కరోనా వైరస్ సోకింది. ఈమేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 787 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు 8,89,295 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 9 మంది మరణించగా, ఇప్పటివరకు 7,234 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9417 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటివరకు రాష్ట్రంలో 1,51,77,364 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి:
భార్య ఫోన్ మాట్లాడటం లేదని..
భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం..