కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి 200 మంది..  

13 Sep, 2022 05:46 IST|Sakshi
గుర్తింపు కార్డులు చూపుతూ వైఎస్సార్‌ సీపీలో చేరుతున్న టీడీపీ కార్యకర్తలు

కుప్పం రూరల్‌(చిత్తూరు): కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ సభ్యత్వం పొందిన గుర్తింపు కార్డులు చేతపట్టుకుని ఎమ్మెల్సీ భరత్‌ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు.

వీరంతా శాంతిపురం మండలం కడపల్లి, కర్లగట్ట, ప్రీతిశ్యామనూరు, మొరసనపల్లి, 7వ మైలు, గుడుపల్లె మండలానికి చెందిన ఆరు పంచాయతీల్లోని టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు. వారికి మంత్రి పెద్దిరెడ్డి కండువాలు కప్పి వైఎస్సార్‌ సీపీలోకి ఆహా్వనించారు.  

మరిన్ని వార్తలు