సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,01,571 కరోనా పరీక్షలు నిర్వహించగా 20,065 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,65,439 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 96 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 8,615కే చేరింది. గడిచిన 24 గంటల్లో 19,272 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 10,69,432 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 1,87,392 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,72,62,441 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.