2018 గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల ఆందోళన

18 Jun, 2021 12:00 IST|Sakshi

విజయవాడ: గ్రూప్‌-1 (2008) క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ప్రతిష్టకు భంగం కలిగించారని అభ్యర్ధుల ఆందోళన చేపట్టారు.  గ్రూప్‌-1  క్వాలిఫైడ్‌ అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయడంపై మండి పడ్డారు. భిన్నాభిప్రాయాలుంటే ఏపీపీఎస్సీతో తేల్చుకోవాలని అభ్యర్ధులు సూచించారు. తమను అసమర్ధులుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి గ్రూప్‌-1 క్వాలిఫైడ్‌ అభ్యర్ధులు ఫిర్యాదు చేశారు. అయితే హైకోర్టు స్టేపై డివిజన్‌ బెంచ్‌కు వెళ్లేందుకు   సిద్ధమైనట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది. 

ఇక్కడ చదవండి: గ్రూప్‌–1 ఇంటర్వ్యూలకు హైకోర్టు బ్రేక్‌


చదవండి: ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన

మరిన్ని వార్తలు