సీఎం జగన్‌ను కలిసిన సివిల్స్‌ 2020 విజేతలు

29 Sep, 2020 19:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నుంచి సివిల్‌ సర్వీసెస్‌కు ఎంపికైన పది మంది విజేతలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సివిల్స్‌కు ఎంపికైన పది మందిని సీఎం జగన్‌ అభినందించారు. వృత్తిలో రాణించి, ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కోరారు. ఏ రాష్ట్ర క్యాడర్‌లో పనిచేసినా మన రాష్ట్రానికి పేరు తెచ్చేలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు