ఏపీలో కొత్తగా 212 కరోనా కేసులు

28 Dec, 2020 16:56 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 37,381 కరోనా పరీక్షలు నిర్వహించగా, 212 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 88,1273కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున నలుగురు మృతిచెందగా, దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7098కి చేరుకుంది. (చదవండి: దేశంలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా)

గత 24 గంటల్లో 410 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా  డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 870752 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఏపీలో 3423 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,16,57,884 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.(చదవండి: కృష్ణా జిల్లాలో దిగ్విజయంగా ముగిసిన ‘డ్రై రన్’)

మరిన్ని వార్తలు