ఏపీలో జీఎస్టీ వసూళ్లు 22 శాతం పెరుగుదల 

2 May, 2022 04:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో 22 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2021 ఏప్రిల్‌లో రూ.3,345 కోట్లు వసూలవ్వగా.. 2022 ఏప్రిల్‌లో రూ.4,067 కోట్లు వసూలయ్యాయని వెల్లడించింది. తెలంగాణలో గతేడాది ఏప్రిల్‌లో రూ.4,262 కోట్లు వసూలు కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో 16 శాతం పెరుగుదలతో రూ.4,955 కోట్లు వచ్చాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ ఏప్రిల్‌లో రూ.1.68 లక్షల కోట్ల మేర జీఎస్టీ వసూలయ్యాయని వివరించింది.   

మరిన్ని వార్తలు