ఏపీలో కొత్తగా 227 కరోనా కేసులు..

10 Jan, 2021 19:40 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 50,027 కరోనా పరీక్షలు నిర్వహించగా, 227 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా బారిన పడివారి సంఖ్య 884916కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా 289 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 875243 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.(చదవండి: ఏపీలో కోవిడ్ వ్యాక్సిన్‌ పంపిణీకి చురుగ్గా ఏర్పాట్లు)

గత 24 గంటల్లో కోవిడ్‌ బారినపడి విశాఖపట్నంలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 7129​కి చేరింది. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,23,24,674 శాంపిల్స్‌ను పరీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2544 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.(చదవండి: అనసూయ ట్వీట్‌‌.. మెగా ఫ్యామిలీలో కలకలం!)

మరిన్ని వార్తలు