250వ రోజు..250 మందితో 25 గంటల దీక్ష ప్రారంభం

19 Oct, 2021 12:31 IST|Sakshi

విశాఖ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన దీక్షలు 250వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా కూర్మన్నపాలెం గేటు వద్ద 250 మంది కార్మికులు ఇరవై ఐదు గంటల నిరవధిక దీక్షను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా హక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఎట్టి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలా ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్మిక సంఘం నాయకులు. హెచ్చరించారు 

చదవండిఇదో రియల్‌ సస్పెన్స్‌ కథ: బెడ్‌రూమ్‌లోని రూ.55 లక్షలు మాయం!
Visakhapatnam: 7 వండర్స్‌ ఇన్‌ వైజాగ్‌

మరిన్ని వార్తలు