సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్ఫటివరకు రాష్ట్రంలో 79,46,860 సాంపిల్స్ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్లో పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల్లో 84,401 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,886 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,565కి చేరింది. కరోనా నుంచి కొత్తగా 3,623 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,88,375గా ఉంది. 24 గంటల్లో కరోనాతో 17 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,676కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,514 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వివరించారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 10.33 శాతం ఉండగా.. ప్రతీ మిలియన్ జనాభాకు 1,48,818 కరోనా పరీక్షలు నిర్వహించారు.