సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 74,757 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,901 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఏపీలో ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 76,96,653కి చేరింది. ఇప్పటివరకు 7,77,900 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 27,300 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది