శ్రీవారి సర్వ దర్శనానికి 30 గంటలు

18 Nov, 2022 05:39 IST|Sakshi

తిరుమల: తిరుమలలో 25 క్యూ కంపార్ట్‌మెంట్లు నిండాయి. సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 30 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 74,412 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,626 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.4.27 కోట్లు వేశారు.   

మరిన్ని వార్తలు