సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 71,96,628 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా గడిచిన 24 గంటల్లో 69,095 సాంపిల్స్ పరీక్షించగా 3,503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,396 యాక్టివ్ కేసులు ఉన్నాయి.కరోనా నుంచి కొత్తగా 5,144 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,49,676 మంది ఉన్నారు. గత 24 గంటల్లో కరోనాతో కొత్తగా 28 మంది మృతి చెందగా..మొత్తం మరణాల సంఖ్య 6,481కి చేరింది.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.