సాక్షి, అమరావతి : ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డుస్థాయిలో 75,02,933 సాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో 74,919 మందికి కరోనా సాంపిల్స్ పరీక్షించగా.. 3,342 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,04,026కు చేరుకుంది. కరోనా నుంచి కొత్తగా 3,572 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 7,65,991గా ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 22 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,566కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 31,469 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 10.72శాతంగా ఉండగా... ప్రతి మిలియన్ జనాభాకు 1,40,504 పరీక్షలు చేస్తున్నారు.