ఏపీలో కొత్తగా 3,495 కరోనా కేసులు

11 Apr, 2021 17:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,719 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,495 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,25,401మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 1,198 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,97,147 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 9 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7300 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 20,954 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,54,29,391 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు