AP: 36 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి 

30 Dec, 2021 07:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 36 మంది డీఎస్పీ (సివిల్‌)లకు అదనపు ఎస్పీలు (సివిల్‌)గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. వీరిలో ఐదుగురు 2020 నుంచి అడ్‌హాక్‌ పద్ధతిలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర హోం శాఖ బుధవారం ఉత్తర్వులిచ్చింది.   

మరిన్ని వార్తలు