సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,337 సాంపిల్స్ పరీక్షించగా.. 3,967మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,75,470కి చేరుకుంది. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మరింత పెరిగింది. 24 గంటల్లో కొత్తగా 5,010 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకోగా.. మొత్తం సంఖ్య 7,30,109 కు చేరింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 38, 979 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ బాధితుల్లో కొత్తగా మంది 25 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6382 కు చేరింది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 69,20,377 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.