ఏపీలో కొత్తగా 4,228 కరోనా కేసులు

13 Apr, 2021 19:04 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,582 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,228 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,32,892మందికి కరోనా వైరస్‌ సోకింది. గడచిన 24 గంటల్లో 1,483 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8 లక్షల 99 వేల 721 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గత 24 గంటల్లో కరోనా బారినపడి మొత్తం 10 మంది మృతి చెందగా, ఇప్పటివరకు 7321 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 25,850 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 1,54,98,728 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు