ఏపీలో కొత్తగా 506 కరోనా కేసులు

13 Dec, 2020 17:10 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 63,873 కరోనా పరీక్షలు నిర్వహించగా, 506 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 87,5531కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 613 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 863508 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. (చదవండి: వ్యాక్సినేషన్‌కు 4 అంచెల వ్యవస్థ!)

గత 24 గంటల్లో కరోనా బారినపడి చిత్తూరు, గుంటూరు, కృష్ణా, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతిచెందగా, ఇప్పటి వరకు 7057 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4966 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. నేటి వరకు 1,08,30,990 శాంపిల్స్‌ను పరీక్షించారు.(చదవండి: జనవరి 15 తర్వాత సెకండ్‌ వేవ్‌!)

మరిన్ని వార్తలు