ఏపీలో కొత్తగా 520 కరోనా కేసులు

11 Dec, 2020 16:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా, 520 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు ఏపీలో కరోనా బారినపడివారి సంఖ్య 874515కి చేరుకుంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 519 మంది కరోనా నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు 8,62,230 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. (చదవండి: నెల రోజుల్లో మనకు వ్యాక్సిన్‌: సీఎం)

గత 24 గంటల్లో కోవిడ్‌ బారినపడి కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందగా, ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7049కి చేరుకుంది.ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. నేటి వరకు 1,06,99,622 శాంపిల్స్‌ను పరీక్షించారు. (చదవండి: అందుకే భారత్‌లో కరోనా ఉధృతి తగ్గుముఖం)

మరిన్ని వార్తలు