సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,889 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5795 మందికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,29,307కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,046 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,72,479గా ఉంది.
కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 33మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6052కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 50,776 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62,16,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.(చదవండి : హరియాణా డిప్యూటీ సీఎంకు కరోనా)