ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం

22 Nov, 2022 17:04 IST|Sakshi

చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద లారీ- బొలెరో వాహనాలు ఎదురెదురుగా డీకొన్నాయి.

ఈ ఘటనలో బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతులను ఛత్తీస్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగే సమయంలో లారీ అతివేగంతో బొలెరోపైకి దూసుకొచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు