సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల వరకూ 52,834 కరోనా పరీక్షలు నిర్వహించడంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 20, 65, 407 కు చేరింది. కొత్తగా 8, 555 మందికి పాజిటివ్గా తేలింది. దాంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,764 చేరినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. అదే సయమంలో గడిచిన 24 గంటల్లో 6,272 మంది పూర్తి ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావడం మొత్తం కోలుకున్న వారి సంఖ్య 82, 886కు చేరింది. మరొకవైపు ఏపీలో తాజాగా కరోనాతో 67 మంది మృతిచెందడంతో ఇప్పటివరకూ ఆ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,474కు చేరింది. ఇక యాక్టివ్ కేసులు 74,404గా ఉన్నాయి.(తమిళనాడు గవర్నర్కు కరోనా పాజిటివ్)