నీతోడు ఎన్నడూ విడిచిపోను!

31 Dec, 2020 08:22 IST|Sakshi
చంద్రయ్యనాయుడు, కుప్పమ్మ (ఫైల్‌)

వృద్ధ దంపతులకు ఒకేసారి అంత్యక్రియలు

పుత్తూరులో చోటు చేసుకున్న ఘటన

సాక్షి, పుత్తూరు రూరల్‌: ధర్మార్థ కామములోన ఏనాడూ నీతోడు ఎన్నడూ నేవిడిచిపోను అని భార్యాభర్తల బంధం గురించి ఓ సినీకవి రాసిన మాటలు యాధృచ్ఛికంగా నిజమయ్యాయి.. వేదమంత్రాల సాక్షిగా ఒకరినొకరు చివరివరకు తోడుంటామని చేసుకున్న ప్రమాణాలను ఆ దంపతులు నిజం చేశారు. కడవరకు ఒకరినొకరు తోడూనీడగా నిలిచి చివరికి ఆ వృద్ధ దంపతులు మృత్యువులోనూ ఒక్కటయ్యారు. భర్త మృతి చెందడంతో చివరిచూపు చూస్తూ ఆమె కూడా ప్రాణాలొదిలిన సంఘటన పుత్తూరులో చోటు చేసుకుంది. (చదవండి: భార్య కాళ్లు పట్టుకుంది.. ప్రియుడు పీకనొక్కాడు)

వివరాలు.. పుత్తూరు మున్సిపల్‌ పరిధి  గోవిందపాళెంకు చెందిన ఎం.చంద్రయ్యనాయుడు (68) గుండెపోటుతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలకు తరలించే సమయంలో కడసారిగా భర్త మృతదేహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భార్య ఎం.కుప్పమ్మ (64) కుప్ప కూలి మృతి చెందింది. దీంతో ఇద్దరికి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా రు. చంద్రయ్య నాయుడు మేస్త్రీ  పనిచేస్తూ జీవనం సాగించేవారు. (చదవండి: వామ్మో! ఉన్నట్టుండి తల చీల్చేసింది..)

మరిన్ని వార్తలు