Andhra Pradesh: క్రీడా ప్రతిభా అవార్డులకు 65 పాఠశాలల ఎంపిక 

28 Aug, 2021 03:25 IST|Sakshi

రేపు క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రదానం

విజయవాడ స్పోర్ట్స్‌: రాష్ట్ర వ్యాప్తంగా 65 జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను క్రీడా ప్రతిభా అవార్డులకు ఎంపిక చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు, స్కూల్‌ గేమ్స్‌ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తి శుక్రవారం వెల్లడించారు. 2019–20 విద్యా సంవత్సరంలో క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చిన పాఠశాలలను (జిల్లాకు ఐదు చొప్పున) ఈ అవార్డులకు ఎంపిక చేశామన్నారు. ఈ నెల 29వ తేదీ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలలకు అవార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. మొదటి స్థానంలో నిలిచిన పాఠశాలకు రూ.10 వేలు, రెండోవ స్థానంలో ఉన్న పాఠశాలకు రూ.8 వేలు, మూడో స్థానానికి రూ.6 వేలు, నాలుగో స్థానంలో ఉన్నవాటికి రూ.4 వేలు, ఐదో స్థానంలో ఉన్నవాటికి రూ.2 వేలు చొప్పున నగదు,  జ్ఞాపికలు అందజేస్తామన్నారు. 

అవార్డులకు ఎంపికైన పాఠశాలలు ఇవే:  
శ్రీకాకుళం జిల్లాలోని అల్లినగరం (ఎచ్చెర్ల మండలం), కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం), ఇప్పిలి (శ్రీకాకుళం), ఫరీద్‌పేట (ఎచ్చెర్ల), లింగవలస (టెక్కలి), విజయనగరం జిల్లాలోని పరది (బొబ్బిలి), టెర్లాం (టెర్లాం), వి.ఆర్‌.పేట (ఎస్‌.కోట), అరకితోట (ఆర్‌.బి.పురం), కస్పా (విజయనగరం), విశాఖపట్నం జిల్లాలోని చంద్రంపాలెం (చినగాడిల్లి), ఏపీటీర్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ (అరకు వ్యాలీ), ఏఎమ్‌జీ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ (భీమిలి), ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ స్కూల్‌(సింహాచలం), తుమ్మలపాలెం (అనకాపల్లి), తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురపాడు (కరప), గొల్లపాలెం (కాజులూరు), జి.గన్నవరం (ఐ.పోలవరం), గవర్నమెంట్‌ హైస్కూల్‌ (కిర్లంపూడి), జి.మామిడ్డ (పెదపూడి), పశ్చిమగోదారి జిల్లాలో ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం స్కూల్‌ (భీమవరం), కామవరపుకోట(కామవరపుకోట), కె.గోకవరం (గోకవరం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌ (పెదవేగి), ఇరగవరం (ఇరగవరం), కృష్ణాజిల్లాలోని ఎస్‌కేపీవీవీ హిందూ హై స్కూల్‌ (విజయవాడ).

ఉయ్యూరు (ఉయ్యూరు), జెడ్పీ బాలుర హైస్కూల్‌ (నూజివీడు), జెడ్పీ బాలుర హైస్కూల్‌ (కొండపల్లి), జెడ్పీ బాలికల హైస్కూల్‌ (నూజివీడు), గుంటూరు జిల్లాలోని ఏఎంజీ హైస్కూల్‌ (చిలకలూరిపేట), చింతయ్యపాలెం (కర్లపాలెం), రాజుపాలెం(రాజుపాలెం), ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూల్‌ (అచ్చంపేట), ఎస్‌బీపురం (నరసరావుపేట), ప్రకాశం జిల్లాలోని కారేడు (ఉలవపాడు), కంచర్లవారిపల్లి (కనిగిరి), చిర్రికూరపాడు (జరుగుమిల్లి), పాకల (ఎస్‌.కొండ), పేర్నమిట్ట (ఎస్‌.ఎన్‌.పాడు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వింజమూరు (వింజమూరు), శ్రీకొలను (ఏఎస్‌పేట), ఇందుకూరుపేట (ఇందుకూరుపేట), వెంగళరావునగర్‌ (నెల్లూరు), తెల్లపాడు (కలిగిరి), వైఎస్సార్‌ జిల్లాలోని ఎంసీ హైస్కూల్‌ మెయిన్‌ (కడప), డీబీసీఎస్‌ఎం హై స్కూల్‌ (ప్రొద్దుటూరు), రమణపల్లి (చెన్నూర్‌), కేజీబీవీ స్కూల్‌ (రామాపురం, కడప), ఎస్‌వీవీ ప్రభుత్వ బాలుర హైస్కూలు (ప్రొద్దుటూరు), కర్నూలు జిల్లాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఆత్మకూరు), ప్రభుత్వ హైస్కూలు (జూపాడు బంగ్లా), భాగ్యనగరం(డోర్నిపాడు), కేజీబీవీస్కూల్‌ (ఆళ్లగడ్డ), చాగలమర్రి (చాగలమర్రి), అనంతరపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం (బుక్కరాయసముద్రం), అమిద్యాల(ఉరవకొండ), కొనకొండ్ల (వజ్రకరూర్‌), పులిమిట్టి (లేపాక్షి), రాప్తాడు (రాప్తాడు), చిత్తూరు జిల్లాలోని మదనపల్లి (మదనపల్లి), తరిగొండ (గుర్రంకొండ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల (ఇరాల), బీఎన్‌ఆర్‌పేట (చిత్తూరు), నల్లేపల్లి (జి.డి.నెల్లూరు).  

మరిన్ని వార్తలు