ఏపీలో 67లక్షలు దాటిన కరోనా పరీక్షలు

13 Oct, 2020 18:54 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 72,082 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,622 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,63,573కు చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 5,715 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య  714427గా ఉంది. తాజాగా కరోనాతో  35 మంది మృతి చెందగా.. మొత్తం మరణాలు 6,291కు చేరాయి. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు సంఖ్య 42,855గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 67,02,810 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు