సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలు చేయించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు కోటి 17వేల 126 పరీక్షలు నిర్వహించింది. గత 24 గంటల్లో 54,710 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 690 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,67,683కు చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా నుంచి కోలుకుని 3,787 మంది డిశ్చార్జ్ అవ్వగా.. మొత్తం 8,52,298 మంది డిశ్చార్జ్ అయ్యారు. ( భారత్లో కొత్తగా 41,810 కరోనా కేసులు )
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,397. వైరస్ బాధితుల్లో కొత్తగా 7 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 6,988కి చేరింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.