కొత్తగా 7073 కేసులు, 48 మంది మృతి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 69,429 నమూనాలు పరీక్షించగా.. 7073 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458 కు చేరింది. ఒక్కరోజులోనే 8,695 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,88,169. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 67,683. వైరస్ బాధితుల్లో కొత్తగా 48 మంది మృతి చెందడంతో.. మొత్తం మృతుల సంఖ్య 5606 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్లో పేర్కొంది. తాజా పరీక్షల్లో 32,691 ట్రూనాట్ పద్ధతిలో, 36,738 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశామని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 54,47,796 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసిట్టు తెలిపింది.
(చదవండి: ఈ ఏడాది మరీ ఇంత దారుణమా: అశ్విన్)