ఏపీ: ఒక్కరోజే 8,291 మంది డిశ్చార్జ్‌

23 Sep, 2020 16:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,291 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,70,667కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల 2వేల 367 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 72,838 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,228 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,46,530 కు చేరింది. గత 24 గంటల్లో 45 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,506కి చేరింది. ప్రస్తుతం 70,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు