ఏపీ: 24 గంటల్లో 10,845 డిశ్చార్జ్‌

16 Sep, 2020 17:32 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,845 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,97,376కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,06,879 టెస్టులు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 75,013 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,835 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,92,760కు చేరింది. కొత్తగా 64మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,105కి చేరింది. ప్రస్తుతం 90,279 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  (రష్యా వ్యాక్సిన్‌- డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి)

మరిన్ని వార్తలు