సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9,628 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,86,531కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది. మంగళవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 47,31,866 శాంపిల్స్ని పరీక్షించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో 70,511 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,846 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,83,925కు చేరింది. కొత్తగా 69మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,041కి చేరింది. ప్రస్తుతం 92,353 యాక్టివ్ కేసులు ఉన్నాయి. (అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు; తొలగని ప్రతిష్టంభన)