సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 53,026 మందికి కరోనా పరీక్షలు జరపగా 8,943 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,70,190కు చేరింది. తాజాగా 9,779 మంది కోవిడ్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 1,80,703కు చేరుకుంది. తాజాగా వైరస్ బాధితుల్లో 97 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2475గా ఉంది. ప్రస్తుతం 89,907 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 27,58,485 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. (చంద్రబాబు ట్వీట్పై స్పందించిన వైద్యారోగ్యశాఖ)